ఆలయంలోని రావి చెట్టు నరికివేత... 'కన్నీరు' పెడుతోందంటున్న భక్తులు!
- వరంగల్ జిల్లాలో ఘటన
- హనుమాన్ ఆలయంలో పూజలందుకుంటున్న రావి చెట్టు
- తండోపతండాలుగా వస్తున్న భక్తులు
దానిని చూసిన భక్తులు, చెట్టు కన్నీరు పెడుతోందని, ఇది హనుమంతుని మహిమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టును భక్తులు పరమ పవిత్రంగా భావిస్తూ, పూజలు చేస్తుంటారు. అటువంటి చెట్టును నరికి వేయడంపై భక్తుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. నిందితులను పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.