ట్రక్కులో ఓవర్లోడ్.. రూ. 2 లక్షల జరిమానా విధించిన ఢిల్లీ పోలీసులు
- సామర్థ్యానికి మించి లోడు
- కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో జరిమానా ఇదే తొలిసారి
- ఢిల్లీలో ఘటన
రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వాహన చట్టానికి సవరణలు చేసిన కేంద్రం ఈ నెల 1 నుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నాయి.