High Court: ఏపీలో జ్యుడీషియల్ కమిషన్.. ప్రివ్యూ ప్రక్రియకు జస్టిస్ శివశంకరరావు నియామకం

  • టెండర్లలో అవినీతికి చోటు లేకుండా ఉండేందుకు జ్యుడీషియల్ కమిషన్  
  •  హైకోర్టును సంప్రదించిన మీదట నియామకం
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు  
టెండర్లలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. జ్యుడీషియల్ ప్రివ్యూ ప్రక్రియకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఆయన్నిప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వంద కోట్లు దాటిన ప్రతి టెండర్ ను జ్యుడీషియల్ కమిషన్ సమీక్షిస్తుంది. కమిషన్ ఆమోదం పొందిన తర్వాతే టెండర్లు ముందుకు సాగుతాయి.
High Court
Justice
Siva shanker rao
AP

More Telugu News