Telugudesam: సీనియర్ మంత్రులకు గెజిట్ కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరం: టీడీపీ నేత కనకమేడల ఎద్దేవా

  • రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులా?
  • పార్టీకి, న్యాయవిభాగానికి ఓ వారధి ఏర్పాటు కావాలి
  • కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తాం

ఏపీ మంత్రులపై టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విమర్శలు గుప్పించారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన టీడీపీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ, సీనియర్ మంత్రులకు గెజిట్ కు, జీవోకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు.

రాజధానికి, రాజధాని పరిధికి తేడా తెలియని వాళ్లు మంత్రులుగా ఉన్నారని సెటైర్లు విసిరారు. పార్టీకి, న్యాయవిభాగానికి ఓ వారధి ఏర్పాటు కావాలని, కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళతామని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలుస్తామని, తమ వెనుక చంద్రబాబు ఉన్నారన్న ధైర్యంతో ముందుకు సాగుతామని చెప్పారు.

More Telugu News