Badminton: ప్రముఖ షట్లర్ పీవీ సింధుకు అరుదైన ఆహ్వానం!

  • మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా సింధు
  • కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆహ్వానం
  • సీఎంతో కలిసి ‘యువ దసరా’ ప్రారంభించనున్న సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత, ప్రముఖ షట్లర్ పీవీ సింధుకు అరుదైన ఆహ్వానం లభించింది. మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా రావాలంటూ పీవీ సింధుకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కాగా, అక్టోబర్ 1న యువ దసరా-2019 కార్యక్రమం ప్రారంభం కానుంది. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి ఈ కార్యక్రమాన్ని సింధు ప్రారంభించనుంది.

More Telugu News