Jamuna: అందుకే నాపై కోపంతో సావిత్రి మాట్లాడటం మానేసింది: జమున

  • సావిత్రిని అక్కా అని పిలిచేదానిని
  • ఎవరో నా గురించి ఆమెకి ఏదో చెప్పారట  
  • సావిత్రి కోపం చల్లారిపోయిందన్న జమున

తెలుగు తెరపై కథానాయికల గురించి చెప్పవలసి వస్తే ముందుగా సావిత్రి పేరు, ఆ తరువాత జమున పేరు చెబుతారు. ఇద్దరూ అగ్రకథానాయికలుగా ఒక వెలుగు వెలిగారు. అక్కాచెల్లెళ్లుగా ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయాయి. తాజా ఇంటర్వ్యూలో జమున మాట్లాడుతూ సావిత్రిని గురించి ప్రస్తావించారు.

"నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి సావిత్రితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరం అక్కా చెల్లెళ్లుగా మసలుకునే వాళ్లం. అలాంటి మేము అయిదు సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదనే ఒక ప్రచారం వుంది. మాట్లాడుకోని మాట నిజమేగానీ, అయిదు సంవత్సరాలు కాదు, ఆరునెలలో .. ఎనిమిది నెలలో అంతే. నేను సావిత్రిని ఏదో అన్నానని ఎవరో ఆమెకి చెప్పారట. అది నిజమేనని భావించిన ఆమె నాపై కోపంతో మాట్లాడటం మానేసింది. ఆ తరువాత ఆమె కోపం చల్లారిపోయింది. మేము గొడవపడిన సందర్భాలు ఎప్పుడూ లేవు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News