Anantapur District: అనంతపురంలో ‘స్పందన’ కార్యక్రమంలో పాము కలకలం!

  • కలెక్టరేట్ లో నిర్వహించిన ‘స్పందన’
  • మంత్రి శంకర్ నారాయణకి ప్రజా సమస్యలపై వినతి
  • ప్రజలతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ‘పాము’ ఘటన

అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ కు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. అనంతరం, మంత్రితో ప్రజలు మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తి కాళ్ల దగ్గరకు పాము వచ్చింది.

ఊహించని ఈ ఘటనతో సదరు వ్యక్తి సహా అక్కడే ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాగా, పక్కనే ఉన్న పొదల్లోకి పాము వెళ్లిపోయింది.

More Telugu News