: హెలికాప్టర్ల ఒప్పందంపై ఆంటోనీ వివరణ ఇవ్వాలి: బీజేపీ

ఇటలీతో భారత్ కుదుర్చకున్న 12 హెలికాప్టర్ల ఒప్పందాన్ని బీజేపీ బోఫోర్స్ కుంభకోణంతో పోల్చింది. ఇది రెండవ బోఫోర్స్ లా ఉందని వ్యాఖ్యానించింది. ఇటలీ హెలికాప్టర్ల ఒప్పందంపై రక్షణ మంత్రి ఆంటోనీ పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ విమర్శించింది. హెలికాప్టర్ల అమ్మకాల ఒప్పందంపై ఆంటోనీ వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు జరిగాయంటూ
గత కొన్ని రోజులుగా ఇటలీ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తుండడంతో, మంగళవారం ఆ దేశ రక్షణ పరికరాల తయారీ సంస్థ అధిపతి జియుసొప్పె ఒర్సిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ కూడా ఈ రోజు సీబీఐ విచారణకు ఆదేశించారు.


More Telugu News