Karimnagar District: కరీంనగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలి దారుణహత్య

  • భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న మహిళ
  • కరీంనగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ నిర్వహణ 
  • కత్తులతో దారుణంగా నరికి చంపిన దుండగులు

భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అమల భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటోంది. గత కొన్నాళ్లుగా కరీంనగర్‌లో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆదివారం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News