Fire Accident: కెమికల్‌ డబ్బాలో పేలుడు : తెగిపడిన వ్యక్తి చేతులు... పరిస్థితి విషమం

  • హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
  • పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం
  • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి శివరాం పల్లి వద్ద ఈరోజు ఉదయం జరిగిన పేలుడు ఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది. ఓ వ్యక్తి తీసుకు వెళ్తున్న రసాయనిక పదార్థం ఉన్న డబ్బాలో ఈ పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. ఫుట్‌పాత్ మీద ఉన్న బాక్సును తెరిచేందుకు ఈ వ్యక్తి ప్రయత్నించగా భారీ శబ్దంతో పేలిపోయిందని చెపుతున్నారు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి చేతులు తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది.  పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే 279వ నంబరు పిల్లరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.    ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

More Telugu News