తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన తమిళి సై సౌందరరాజన్!
- తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ గా రికార్డు
- ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ చౌహాన్
- అభినందనలు తెలిపిన కేసీఆర్, కిషన్ రెడ్డి, దత్తన్న
ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, తెలంగాణ మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళి సైకి పుష్పగుచ్ఛం అందించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


