Telangana: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికే జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు!

  • సంగారెడ్డి జిల్లాలో రాంగ్ రూట్లో వెళ్లిన కారు
  • ఈ నెల 3న ఫిర్యాదు చేసిన సామాన్యుడు
  • నిబంధనల మేరకు రూ.1,135 జరిమానా విధింపు

చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు.  రాంగ్ రూట్లో తమ బాస్ కారు  వెళ్లినప్పటికీ జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది.

ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.  దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు.

More Telugu News