Andhra Pradesh: తన పుట్టినరోజున కార్యకర్తలు విరాళాలు సేకరించడంపై స్పందించిన పవన్ కల్యాణ్!

  • ఈ నెల 2న పవన్ పుట్టినరోజు
  • భారీగా విరాళాలు సేకరించిన జనసైనికులు
  • వివరాలు వెల్లడించిన జనసేనాని

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 2న తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు జనసైనికులు పార్టీ కోసం విరాళాలు సేకరించారు. తాజాగా ఈ విషయమై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. తన పుట్టినరోజున జనసైనికులు రూ.3 కోట్లకు పైగా విరాళాలు సేకరించారని పవన్ తెలిపారు. వీరిలో చాలామంది రూ.10, రూ.50, రూ.100, రూ.1,000లు చందాలు వేసుకున్నారని వెల్లడించారు. ఈ సొమ్ము సినిమాల వల్ల వచ్చింది కాదనీ, జనసేన అభిమానులు, మద్దతుదారులు ఈ పార్టీ మాది అని పెట్టిన పెట్టుబడని వ్యాఖ్యానించారు.

More Telugu News