Anushka: 'నిశ్శబ్దం' ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
  • ముఖ్యపాత్రల్లో అంజలి - షాలినీ పాండే 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 

కొంతకాలంగా అనుష్క నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'నిశ్శబ్దం' రూపొందుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. కథాపరంగా విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News