Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీశ్ ను హత్య చేసింది హేమంతే!: డీసీపీ వెల్లడి

  • కేపీహెచ్ బీ కాలనీలో ఇటీవల జరిగిన హత్య
  • ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సతీశ్, ఫ్రెండ్ హేమంత్ పార్టనర్స్
  • సతీశ్ తో బాగా తాగించి ఇనుప రాడ్ తో కొట్టి హత్య 

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీశ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పక్కా ప్లాన్ ప్రకారమే సతీశ్ ను హేమంత్ హత్య చేశాడని చెప్పారు. ఇద్దరికీ పరిచయం వున్న ఉద్యోగి ప్రియాంక కోసమే సతీశ్ ని హేమంత్ హత్య చేశాడని చెప్పారు. ఐరన్ రాడ్ తో కొట్టి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. హేమంత్ ఇంట్లో సతీశ్ మృతదేహం దొరికిందని వివరించారు. గత నెల 27న సతీశ్ కు హేమంత్ ఫోన్ చేశాడని, మద్యం బాటిళ్లు తీసుకుని తన గదికి రావాలని చెప్పాడని అన్నారు.

సతీశ్ తో ఫుల్ గా మద్యం తాగించి ఐరన్ రాడ్ తో సతీశ్ తలపై హేమంత్ కొట్టాడని, ఆపై కత్తితో అతని గొంతు కోసి హత్య చేశాడని తెలిపారు. సతీశ్ శరీరాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసేందుకు హేమంత్ విఫలయత్నం చేసినట్టు హేమంత్ ను విచారణ చేయగా తెలిసిందని పేర్కొన్నారు. సతీశ్ మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు కొన్ని కవర్లు కూడా హేమంత్ తీసుకొచ్చాడని, అయితే, ప్యాక్ చేయడం సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేశాడని, అన్ని ఆధారాలు సేకరించాకే హేమంత్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా, ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సతీశ్, హేమంత్ పార్టనర్స్. తన భర్త సతీశ్ కనిపించడం లేదంటూ అతని భార్య గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News