Chiranjeevi: 20 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేసిన చిరంజీవి

  • వేగంగా జరుగుతున్న 'సైరా' పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • త్వరలోనే ఆడియో వేడుకలను నిర్వహించేందుకు సన్నాహకాలు
  • అక్టోబర్ 2న విడుదలకానున్న 'సైరా'

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. త్వరలోనే ఆడియో వేడుకలను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మరోవైపు, తన డబ్బింగ్ పనులను చిరంజీవి పూర్తి చేశారు. కేవలం 20 రోజుల్లోనే చిరంజీవి తన డబ్బింగ్ ను పూర్తి చేయడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంది.

More Telugu News