Muralinohan: ఏ ప్రభుత్వం కూడా నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదు: మురళీమోహన్

  • నంది అవార్డులపై మురళీమోహన్ ఆవేదన
  • ఇప్పుడు అవార్డుల గురించి మాట్లాడేవాళ్లే లేరన్న సీనియర్ నటుడు
  • ప్రస్తుత ప్రభుత్వమైనా నంది అవార్డులు ప్రకటించాలని విజ్ఞప్తి

సీనియర్ నటుడు, రాజకీయవేత్త మురళీమోహన్ నంది అవార్డులపై స్పందించారు. ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జయసుధతో కలిసి పాల్గొన్న మురళీమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు అవార్డులు పండుగ అంటూ ఉండేదని, ఇప్పుడా అవార్డుల గురించి మాట్లాడేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ నంది అవార్డులను విస్మరించాయని అన్నారు.

నంది అవార్డులు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులంటే గొప్పగా చెప్పుకుంటారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అయితే కొంతకాలంగా ఈ అవార్డులను పట్టించుకోవడం మానేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సిన అవార్డులను ప్రదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

More Telugu News