L.B.Sriram: 'మిథునం' సినిమాలో నేను చేయవలసింది: హాస్యనటుడు ఎల్బీ శ్రీరామ్

  • 500ల సినిమాలు చేసిన ఎల్బీ 
  • నాకు చెప్పడానికి భరణి మొహమాటపడ్డాడు
  • బాలు గారితో కథ పట్టాలెక్కిందన్న ఎల్బీ  

తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎల్బీ శ్రీరామ్ కనిపిస్తారు. 500 సినిమాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం తనకి నచ్చిన పాత్రలు రాని కారణంగా సినిమాలు తగ్గించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'మిథునం' సినిమాను గురించి ప్రస్తావించారు.

తనికెళ్ల భరణి 'మిథునం' సినిమాను నాతో చేయాలని ప్లాన్ చేశాడు. ఇద్దరం కలిసి ఒక లొకేషన్ కూడా ఓకే చేసుకున్నాము. నా సరసన చేసే లేడీ ఆర్టిస్ట్ గురించిన అన్వేషణ మొదలైంది. కొంతమందిని చూశారుగానీ, ఎల్బీ పక్కన ఈవిడేవిటి? అనుకున్నారు. ఆ తరువాత సీనియర్ హీరోయిన్ లక్ష్మిగారిని తీసుకున్నారు. దాంతో ఈవిడ పక్కన ఎల్బీ ఏవిటి? అనుకున్నారు. ఈ విషయం నాకు చెప్పడానికి భరణి ఇబ్బందిపడ్డాడు. పెద్దగా పట్టించుకోవద్దని చెప్పాను నేను. ఆ తరువాత నిర్మాత మారిపోవడం .. మరో నిర్మాత బాలు గారి పేరును సూచించడంతో ఆయనతో సినిమా ముందుకెళ్లింది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News