Venkatesh: వెంకీ తదుపరి ప్రాజెక్టులపై రాని క్లారిటీ

  • ముగింపు దశలో 'వెంకీమామ'
  • నక్కిన త్రినాథరావుతో సినిమా లేనట్టే 
  • డాలీ ప్రాజెక్టు కూడా అటకెక్కినట్టే  

వెంకటేశ్ తాజా చిత్రంగా 'వెంకీమామ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవల ఒక వార్త షికారు చేసింది. కానీ వెంకటేశ్ ఈ సినిమా చేయడం లేదనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది.

ఈ కారణంగానే నక్కిన త్రినాథరావు, తన తదుపరి సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇక 'గోపాల గోపాల' సినిమా దర్శకుడు 'డాలీ'తోను వెంకటేశ్ ఒక సినిమా చేయనున్నట్టు కూడా ఒక టాక్ వచ్చింది. ఇటీవల హిందీలో హిట్ కొట్టిన 'దే దే ప్యార్ దే' సినిమాకి ఇది రీమేక్ అన్నారు. కానీ ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కేసిందనే ప్రచారం జరుగుతోంది. దాంతో 'వెంకీమామ' తరువాత వెంకటేశ్ చేయనున్న ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది.

More Telugu News