India: విండీస్ కు కష్టసాధ్యమైన టార్గెట్ ఇచ్చిన టీమిండియా

  • రెండో ఇన్నింగ్స్ ను 168/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్
  • విండీస్ లక్ష్యం 468 రన్స్
  • ప్రస్తుతం 4 వికెట్లకు 135 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు

వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారత్ పూర్తిగా పట్టుబిగించింది. తన రెండో ఇన్నింగ్స్ ను 168/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత్ తన ప్రత్యర్థి ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్నుంచింది. నాలుగో రోజు ఉదయం లక్ష్యఛేదన ఆరంభించిన కరీబియన్లు 135 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టారు. క్రీజులో షామార్ బ్రూక్స్ 31 పరుగులతో, జెర్మైన్ బ్లాక్ వుడ్ 28 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ కు 2 వికెట్లు, షమీ, జడేజాకు చెరో వికెట్ దక్కాయి.

ఈ మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, విండీస్ 117 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 168 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తెలుగుతేజం హనుమవిహారి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రహానేతో కలిసి విలువైన పరుగులు జోడించాడు. రహానే 64 పరుగులు చేయగా, విహారి 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.

More Telugu News