వైఎస్ నా రాజకీయ గురువు.. ఎల్లవేళలా వెన్నుతట్టి ప్రోత్సహించారు!: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- నేడు వైఎస్ వర్థంతి
- నివాళులు అర్పించిన కోమటిరెడ్డి
- తెలంగాణలోనూ వైఎస్ కు అభిమానులు ఉన్నారని వ్యాఖ్య
రైతులకు ఉచిత విద్యుత్, పేదల పాలిట వరంగా నిలిచిన 108 సేవలను వైఎస్ తీసుకొచ్చారని చెప్పారు. ‘రైతు బాంధవుడు, జలయజ్ఞం ద్వారా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టిన ఘనత వైఎస్సార్కే దక్కుతుంది. ముచ్చర్లలో పార్మ సిటీ ఏర్పాటు చేశారు. కాళేశ్వరానికి పెట్టిన బాహుబలి మోటార్లు తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే. వైఎస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారు’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.