Saaho: సత్తా చాటిన 'సాహో'... రెండు రోజుల్లో రూ.200 కోట్లు!

  • శుక్రవారం విడుదలైన 'సాహో'
  • చిత్రానికి మిక్స్ డ్ టాక్
  • తగ్గని కలెక్షన్లు!

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సాహో' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'సాహో', రెండో రోజు కూడా అదే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. మొత్తమ్మీద రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మేరకు 'సాహో' నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

More Telugu News