Allu Arjun: 'అల .. వైకుంఠపురములో' ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • త్రివిక్రమ్ నుంచి 'అల వైకుంఠపురములో'
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న 'టబు'
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాలు చేసిన అల్లు అర్జున్, ఆయనతో మూడవ సినిమా చేయడానికి కొన్ని రోజుల క్రితమే రంగంలోకి దిగాడు. ఇటీవలే ఈ సినిమాకి 'అల .. వైకుంఠపురములో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

 రేపు ఉదయం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను వదిలారు. రేపు ఉదయం 9 గంటలకు ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. టైటిల్లోనే తనదైన మార్క్ చూపించిన త్రివిక్రమ్, ఫస్టులుక్ తోనే అంచనాలు పెంచే పనిలో వున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో 'టబు' కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News