law student: చిన్మయానంద్‌పై ఆరోపణలు చేసిన లా విద్యార్థిని ఢిల్లీ హోటల్ లో కనిపించింది!

  • బీజేపీ నేత చిన్మయానంద కాలేజీలో చదువుతున్న విద్యార్థిని
  • వీడియో వైరల్ అవడంతో హాస్టల్ నుంచి అదృశ్యం
  • ఓ హోటల్‌లో గుర్తించిన యూపీ పోలీసులు

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందపై సంచలన ఆరోపణలు చేసి ఆ తర్వాత అదృశ్యమైన లా విద్యార్థిని ఢిల్లీలోని ఓ హోటల్‌లో కనిపించింది. చిన్మయానందకు చెందిన కాలేజీలోనే చదువుతున్న విద్యార్థిని.. అతడు తనను వేధిస్తున్నాడని, ఎంతోమంది అమ్మాయిల జీవితాలు అతడి చేతిలో పడి నాశనమైపోయాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో వీడియో పోస్టు చేసింది.

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆదివారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. తన కుమార్తె అదృశ్యం కాలేదని, కిడ్నాప్‌కు గురైందంటూ ఆమె తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని గుర్తించారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఆమె ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లేసరికే ఆమె వెళ్లిపోయింది.

విద్యార్థిని అదృశ్యంపై జాతీయ మహిళా కమిషన్, ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, బాధిత యువతి ఫిర్యాదుపై చిన్మయానందపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన తరపు లాయర్ మాట్లాడుతూ.. చిన్మయానందపై కుట్ర జరుగుతోందని, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News