Prabhas: ఇన్ స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేయండి.. ఫ్యాన్స్ కు ప్రభాస్ ఆఫర్

  • రేపు ప్రపంచవ్యాప్తంగా 'సాహో' రిలీజ్
  • అభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించిన ప్రభాస్
  • 'సాహో' పోస్టర్ కనిపిస్తే సెల్ఫీ దిగి తనను ట్యాగ్ చేయాలంటూ సూచన
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆలిండియా లెవెల్లో 'సాహో' మేనియా కనిపిస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సాహో' చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు ప్రభాస్ ఆఫర్ ప్రకటించాడు.

"హాయ్ డార్లింగ్స్" అంటూ ఆప్యాయంగా పలకరించిన ప్రభాస్, 'సాహో' సినిమా పోస్టర్ కనిపిస్తే ఓ సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్ లో తనను ట్యాగ్ చేయాలంటూ పిలుపునిచ్చాడు. అలా ట్యాగ్ చేసిన వాళ్ల నుంచి కొందరు లక్కీ ఫెలోస్ ను ఎంపిక చేసి వారికి తనను కలిసే అవకాశం ఇస్తానని ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. విన్నర్స్ ను వ్యక్తిగతంగా తానే ఎంపిక చేస్తానని అభిమానులకు తెలిపాడు.


More Telugu News