Kalyan Ram: 'ఎంత మంచివాడవురా'లో హాట్ భామగా నటాషా దోషి

  • సతీశ్ వేగేశ్న నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • కల్యాణ్ రామ్ కి ఇది 17వ సినిమా
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్నకి మంచి పేరు వుంది. గతంలో 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' సినిమాలను తెరకెక్కించిన ఆయన, ఈ సారి 'ఎంతమంచివాడవురా' సినిమాను రూపొందిస్తున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగు వుందట. తాజాగా ఆ ఐటమ్ సాంగును చిత్రీకరించారని చెబుతున్నారు. నటాషా దోషి - కల్యాణ్ రామ్ పై చిత్రీకరించిన ఈ ఐటమ్ సాంగ్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ 'జై సింహా'లో నాయికగా నటాషా దోషి, మెరిసిన సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ కి ఇది 17వ సినిమా. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News