Kodela: గుంటూరు 'గౌతమ్ హీరో షోరూం'లో శాసనసభ ఫర్నిచర్.. అసెంబ్లీకి తరలించిన అధికారులు!

  • కోడెల తనయుడి షోరూంలో ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్
  • అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో తరలింపు కార్యక్రమం
  • పాలుపంచుకున్న అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది

ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ ను మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన వద్ద ఉంచుకోవడం వివాదాస్పదమవడం తెలిసిందే. కొంత ఫర్నిచర్ కోడెల తనయుడికి చెందిన షోరూంలో దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో గుంటూరులోని గౌతమ్ హీరో షోరూం నుంచి ఫర్నిచర్ ను శాసనసభకు తరలించారు. అసెంబ్లీ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫర్నిచర్ తరలింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియలో అసెంబ్లీ సిబ్బందితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. కాగా,ఈ ఫర్నిచర్ విలువ రూ.65 లక్షల పైనే ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి.

More Telugu News