Ambareesh: భర్త అంబరీష్ ను తలుచుకుని భావోద్వేగాలకు గురైన సుమలత

  • గత నవంబరు 24న అంబరీష్ హఠాన్మరణం
  • భర్త జ్ఞాపకాలు వెన్నంటే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సుమలత
  • మా జీవితాల్లో నీ స్థానం భర్తీ చేయలేనిది అంటూ వ్యాఖ్యలు

పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి సుమలత తన భర్త అంబరీష్ మరణించి 9 నెలలు అయిందని, ఇంకా ఆయన జ్ఞాపకాలు తన వెన్నంటే ఉన్నాయని భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. అంబరీష్ తో తన అనుబంధానికి 27 ఏళ్లు అని, అయితే ఈ 9 నెలల కాలంలో ఎంతో నేర్పిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీ జ్ఞాపకాలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితంలోనూ, అభి జీవితంలోనూ, అభిమానుల జీవితంలోనూ నీ స్థానం భర్తీ చేయలేనిది అంటూ వ్యాఖ్యానించారు.

అంబరీష్, సుమలత దంపతులకు అభి ఏకైక కుమారుడు అన్న సంగతి తెలిసిందే. అభీని సినిమా హీరోగా లాంచ్ చేయాలన్న కల తీరకముందే అంబరీష్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. గుండెపోటు కారణంగా నవంబరు 24న కన్నుమూశారు.

  • Loading...

More Telugu News