Anantapur District: పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • అనంతపురం జిల్లాలోని ఫ్యాక్టరీలో ప్రమాదం
  • పేలిన బాయిలర్
  • ఆరుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాయిలర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి గాయపడిన వారి తాలూకూ కుటుంబ సభ్యులు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  


More Telugu News