Pawan Kalyan: అమరావతిలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

  • ఈ నెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటన
  • రైతులను కలవనున్న జనసేనాని
  • అమరావతిలో నిలిచిపోయిన పనులను పరిశీలించనున్న పవన్

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో ఉన్న రైతులను ఆయన కలవనున్నారు. అమరావతిలో నిలిచిపోయిన రాజధాని పనులను పరిశీలిస్తారు.

మరోవైపు, అమరావతి రైతులు ఈరోజు హైదరాబాదులో పవన్ ను కలిశారు. తమకు ఇవ్వాల్సిన కౌలు డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఈ సందర్భంగా పవన్ కు తెలిపారు. రాజధానిని మార్చబోతున్నారనే వార్తలతో తాము ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. తమ సమస్యలపై పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో, అమరావతిలో పర్యటించాలని పవన్ నిర్ణయించారు.

More Telugu News