అమరావతిలో సుజనాకు భూములున్నాయన్న విజయసాయిరెడ్డి.. ఘాటుగా స్పందించిన బీజేపీ నేత!
- సాయిరెడ్డి చౌకబారు ట్వీట్లకు స్పందించాల్సి వస్తుందనుకోలేదు
- 1910-2010 కాలంలోనే కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి
- దమ్ముంటే భూమి ఉన్నట్లు నిరూపించండి
1910-2010 మధ్యకాలంలో వంశపారంపర్యంగా, ఇతరత్రా జరిగిన రిజిస్ట్రేషన్లు మినహా తనకు, తన కుటుంబానికి అమరావతిలో కొత్తగా సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. ఒకవేళ భూమి ఉన్నట్లు నిరూపిస్తే అప్పుడు తగిన విధంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్వీట్లతో తన పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోవద్దని సుజనా హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.