Andhra Pradesh: దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా? అసమర్థత అనాలా?: గల్లా జయదేవ్

  • లంక గ్రామాల ప్రజలతో ఇటీవలే మాట్లాడా
  • వర్షాలు లేకుండా ఇలాంటి వరదలు చూడలేదంటున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తీవ్రంగా మండిపడ్డారు. తాను ఇటీవల లంక గ్రామాల ప్రజలతో మాట్లాడాననీ, వర్షాలు లేకుండా ఈ స్థాయి వరదను తాము ఎన్నడూ చూడలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని జయదేవ్ తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ముందస్తు సమాచారం వచ్చినా సరైన చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని దుయ్యబట్టారు. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఒకేసారి డ్యామ్ గేట్లు తెరవడం వల్లే పలు ప్రాంతాలు మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా? లేక అసమర్థత అనాలా? అని జయదేవ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News