Andhra Pradesh: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సుబ్బారాయుడు కుమారుడి మృతి!

  • ఈరోజు కన్నుమూసిన నారాయణరాయుడు
  • నివాళులు అర్పించిన టీడీపీ, వైసీపీ నేతలు, అభిమానులు
  • మృతికి గల కారణంపై రాని స్పష్టత

తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు నారాయణరాయుడు(చంటిబాబు) ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ నేతలు, అభిమానులు నర్సాపురం రుస్తుంబాద లోని సుబ్బారాయుడు ఇంటికి పెద్దఎత్తున చేరుకున్నారు. నారాయణరాయుడు మృతదేహానికి నివాళులు అర్పించారు. టీడీపీ నేత సుబ్బారాయుడుకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, నారాయణరాయుడు మరణానికి గల కారణంపై స్పష్టత రాలేదు.

More Telugu News