Bangladesh: బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 15,000 ఇళ్లు!

  • రాజధాని ఢాకాలో ఘటన
  • ప్రమాదంలో నలుగురికి గాయాలు
  • 6 గంటలు కష్టపడి మంటల్ని ఆర్పిన సిబ్బంది

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మురికివాడలో గత శుక్రవారం చెలరేగిన ఈ ప్రమాదంలో 15,000 ఇళ్లు కాలి బూడిదైనట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదనీ, అయితే నలుగురు మాత్రం గాయపడ్డారని వెల్లడించారు.

బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు ఇళ్లలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 7.22 గంటలకు ఈ మంటలు ప్రారంభమయ్యాయనీ, క్షణాల్లో ఈ ప్రాంతమంతా వ్యాపించాయని చెప్పారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో 6 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

More Telugu News