Telangana: ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ వద్ద నాగర్ కర్నూలు వాసి దారుణ హత్య!

  • ఈరోజు తెల్లవారుజామున ఘటన
  • హత్య చేసి పరారైన దుండగులు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్ లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ వద్ద గుర్తుతెలియని కొందరు దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మృతుడి పేరు బంగారి(55) అని తెలిపారు. ఈయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామమని చెప్పారు. ఈ హత్య చేసేందుకు గల కారణం ఇంకా తెలియరాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News