Kabool: కాబూల్ పెళ్లి వేడుకపై ఉగ్రవాదుల దాడి!

  • 40 మందికి పైగా మృతి
  • 100 మందికి పైగా గాయాలు
  • మూడు రోజుల వ్యవధిలో రెండో దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న వేళ, ఒంటికి బాంబులను అమర్చుకున్న ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ దాడిలో 40 మందికి పైగా మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు, జవాన్లు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. పెళ్లి వేడుకలో వందలాది మంది సంబరాలు జరుపుకుంటున్న వేళ, ఈ ఘటన జరిగింది. మూడు రోజుల వ్యవధిలో కాబూల్ లో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. 14వ తేదీన కూడా కాబూల్‌లో భద్రతా దళాలు లక్ష్యంగా తాలిబన్లు కారు బాంబుతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

More Telugu News