Nalini: పాప పెళ్లి ఇంకా కుదరలేదు... మరో నెల రోజుల పెరోల్ కావాలంటున్న నళిని!

  • ఇంకా ఇండియాకు రాని హరిద్ర
  • సెప్టెంబర్ వరకూ పరీక్షలు ఉన్నాయన్న నళిని తల్లి
  • నలుగురిని చూశామని అంటున్న పద్మ

కుమార్తె పెళ్లి నిమిత్తం నెల రోజుల పెరోల్ పై వేలూరు కేంద్ర కర్మాగారం నుంచి బయటకు వచ్చిన రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళిని, మరో నెల రోజుల పెరోల్ కావాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. గత నెల 20 నుంచి వేలూరులోని సత్ వచ్చారి భవనంలో నివాసం ఉంటున్న ఆమె, నిత్యమూ పోలీసు స్టేషన్ లో సంతకం పెడుతోంది. కుమార్తె హరిద్ర వివాహం జరిపించేందుకు మరింత సమయం పడుతుందన్న ఉద్దేశంలో ఉన్న ఆమె, పెరోల్ ను పొడిగించాలని కోరుతోంది.

ఈ విషయాన్ని వెల్లడించిన నళిని తల్లి పద్మ, మనుమరాలికి వివాహం జరిపించేందుకు నలుగురిని చూశామని, ఆమె విదేశాల నుంచి రాగానే, వారిని చూపించి, ఒకరిని నిశ్చయం చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ వరకూ ఆమెకు పరీక్షలు ఉన్నందున భారత్ రాక ఆలస్యం అవుతోందని, అందువల్ల పెరోల్ పొడిగింపును కోరుతున్నామని, కోర్టు తమ విజ్ఞప్తిని మన్నిస్తుందనే భావిస్తున్నామని అన్నారు.

More Telugu News