Chiranjeevi: మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్!

  • దుబాయ్ లో సైమా అవార్డుల కార్యక్రమం
  • చిరంజీవి ముందుకు వచ్చి కూర్చున్న కీర్తి
  • చేతులు పట్టుకుని చిరునవ్వుతో ముచ్చట్లు

'మహానటి' చిత్రంలో తన అత్యుత్తమ నటనకుగాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న కీర్తి సురేశ్, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ ఘటన దుబాయ్ లో సైమా అవార్డుల కార్యక్రమంలో జరిగింది. అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా, ఆ కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో వచ్చిన కీర్తి సురేశ్, చిరంజీవి వద్దకు వెళ్లి, ఆయన ముందు కూర్చుని, ఆశీస్సులు తీసుకుంది. చిరంజీవి కూడా ఆమె చేతులు పట్టుకుని, నవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. 'మహానటి'లో కీర్తి సురేశ్ నటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు అభినందనల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

More Telugu News