rakhi: నారా లోకేశ్ కు రాఖీ కట్టిన భూమా అఖిలప్రియ!

  • రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న అఖిలప్రియ
  • లోకేశ్ కు స్వీట్ తినిపించిన టీడీపీ మహిళా నేత
  • అఖిల లాంటి సోదరి ఉండటం తన అదృష్టమన్న లోకేశ్

దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా రాఖీ పండుగను జరుపుకుంటున్న సంగతి తెలిసిిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ కు అదే పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియ ఈరోజు రాఖీ కట్టారు. అనంతరం లోకేశ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న నారా లోకేశ్, ‘థాంక్యూ అఖిలప్రియా. నీలాంటి సోదరి ఉండటం నిజంగా నా అదృష్టమే. రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలప్రియ తనకు రాఖీ కడుతున్న, స్వీట్ తినిపిస్తున్న ఫొటోలను లోకేశ్ పోస్ట్ చేశారు.

More Telugu News