Andhra Pradesh: ఏపీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందే!: సీఎం జగన్ స్పష్టీకరణ

  • ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి
  • నైపుణ్యవంతులైన మానవవనరులను అభివృద్ధి చేయాలి
  • తాడేపల్లిలో పారిశ్రామిక రంగంపై సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్ లోని పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇతర మంత్రులు అనిల్ కుమార్, బొత్స, లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని పునరుద్ఘాటించారు.

ఈ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్లే రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వగలమని చెప్పారు.

More Telugu News