sai Dharam tej: కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో

  • సెట్స్ పై 'ప్రతిరోజూ పండగే'
  • నెక్స్ట్ మూవీ మేర్లపాక గాంధీతో
  • లైన్లో కొత్త దర్శకుడు సుబ్బు

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాతో పాటు ఆయన మరో రొమాంటిక్ కామెడీ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఒక వైపున మేర్లపాక గాంధీతో సినిమా చేస్తూనే, మరో వైపున సుబ్బు సినిమాను కూడా చేసే ఆలోచనలో తేజు వున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాల టైటిల్స్ .. హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలతో పాటు మిగతా వివరాలు కూడా బయటికి రానున్నాయి.

More Telugu News