Narendra Modi: మోదీ-షాలపై రజనీకాంత్ ప్రశంసలు.. వెటకారంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ!

  • ఆర్టికల్ 370ని రద్దుచేసిన కేంద్రం
  • మోదీ, షాను పొగిడిన రజనీకాంత్
  • రజనీకాంత్ వ్యాఖ్యలపై ఒవైసీ వ్యంగ్యం

తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులుగా సంబోధించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంపై రజనీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాజాగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై వ్యంగ్యంగా స్పందించారు.

‘ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ఓ తమిళ యాక్టర్(రజనీకాంత్) ప్రధాని మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా సంబోధించాడు. అయితే ఈ పరిస్థితుల్లో పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు? దేశంలో మరో మహాభారత యుద్ధం జరగాలనుకుంటున్నారా?’ అని వెటకారంగా స్పందించారు. 

More Telugu News