Andhra Pradesh: రెవెన్యూ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సీఎం జగన్!

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభం
  • భూముల రీసర్వే, భూ రికార్డుల ప్రక్షాళనపై దృష్టి
  • హాజరైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, కౌలుదారుల రక్షణ చట్టంపై భూయజమానులకు అవగాహన కల్పించడంపై సీఎం ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ మంత్రి  పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

More Telugu News