జాతి ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370 రద్దు: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఇది రాజకీయపరమైన అంశంkకాదు
- కశ్మీర్ ప్రజల వెనుక దేశ ప్రజలంతా ఉంటారు
- చరిత్రను విశ్లేషించుకుని ముందడుగు వేయాలి
'చరిత్రను మనందరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏం జరిగింది, ఏం జరగలేదు అనే అంశాలను విశ్లేషించుకుని ముందడుగు వేయాలి. జాతి ప్రయోజనాలు, భవిష్యత్తు, భద్రత కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశారు' అని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడు రచించిన 'లిజనింగ్... లెర్నింగ్... లీడింగ్' పుస్తకాన్ని నిన్న చెన్నైలో ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వెంకయ్యనాయుడు పుస్తక రూపంలో తీసుకువచ్చారు.
చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంతి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.