Andhra Pradesh: దాడులు చేయడమే పరిపాలన అని జగన్ అనుకుంటున్నారు!: కళా వెంకట్రావు

  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • మా నేతలు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారు
  • ఎటు ప్రయాణిస్తున్నారో జగన్ కు తెలియడం లేదు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులను ఆయన ఖండించారు.
దాడులు చేయడమే పరిపాలన అని జగన్ అనుకుంటున్నారని, ఎటు ప్రయాణిస్తున్నారో ఆయనకు తెలియడం లేదని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News