Venkaiah Naidu: పుస్తకం రాసిన వెంకయ్యనాయుడు... ఆవిష్కరించిన అమిత్ షా!

  • చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో కార్యక్రమం
  • 'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్' టైటిల్ తో బుక్
  • పుస్తకంలో 300 ప్రజా కార్యక్రమాల వివరాలు

ఉపరాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ముప్పవరపు వెంకయ్యనాయుడు రచించిన 'లిజనింగ్.. లెర్నింగ్.. లీడింగ్' పుస్తకాన్ని కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, ఈ పుస్తకాన్ని విడుదల చేసి ప్రసంగించారు. ఈ పుస్తకంలో వెంకయ్యనాయుడు తన అనుభవాలను పంచుకున్నారని, అవి యువతకు మార్గ నిర్దేశనం చేస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా, వెంకయ్యనాయుడు నిర్వహించిన 330 ప్రజా కార్యక్రమాల వివరాలను కూడా పుస్తకంలో పొందుపరిచారు.

More Telugu News