జవహర్లాల్ నెహ్రూ నేరస్థుడు...నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్
- ట్విట్టర్లో విరుచుకుపడిన బీజేపీ నేత
- కశ్మీర్ విషయంలో ఆయనదే తప్పిదమని తీవ్ర విమర్శలు
- కాల్పుల విరమణ ప్రకటించి నష్టపరిచారని వ్యాఖ్యలు
‘నెహ్రూ ఓ నేరస్థుడు. ఆయన చర్యల వల్లే కశ్మీర్ కుంపటి ఇప్పటికీ రగులుతోంది. పైగా 370 అధికరణతో నెహ్రూ మరో నేరానికి ఒడిగట్టారు. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు అనే విధానం ఎంతమాత్రం సరికాదు. ఇది నేరమే’ అంటూ ట్విట్టర్లో తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. కశ్మీర్ నుంచి పాకిస్థాన్ గిరిజనులను భారత సైన్యం విజయవంతంగా తరిమేస్తుండగా హఠాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి నెహ్రూ చేయరాని తప్పు చేశారని ఆరోపించారు.
అప్పటికే పాకిస్థాన్ కశ్మీర్లో మూడో వంతు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుందని, ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అప్పుడు నెహ్రూ అలా చేసి ఉండకుంటే కశ్మీర్ మొత్తం భారత్ వశమయ్యేదని, ఇప్పుడీ సమస్యలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు.