పుల్వామా తరహా దాడులకు అవకాశం.. ఆంధ్రప్రదేశ్లో హై అలెర్ట్!
- ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుట్ర
- విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న దాడులు చేసేందుకు జైషే మహ్మద్ కుట్ర పన్నినట్టు గుర్తించిన నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వైమానిక దాడులకు ఆస్కారం ఉందన్న సమాచారంతో అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు టికెట్లు తీసుకున్న ప్రయాణికులను తప్ప సందర్శకులెవరినీ విమానాశ్రయాల్లోకి అనుమతించరు.