ఆకలితో అలమటిస్తున్న ఈ పేదల బాధ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా?: చంద్రబాబు ఆగ్రహం
- వృద్ధులను 2-3 సార్లు ఆఫీసులకు తిప్పుతున్నారు
- ఒకటో తేదిన ఇవ్వాల్సిన పింఛన్లు ఇంకా ఇవ్వకపోవడం ఏంటి?
- ట్విట్టర్ వేదికగా మండిపడ్డ చంద్రబాబు నాయుడు
‘అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్న సామాన్యుల వీడియోలను పోస్ట్ చేశారు.