మహిళా ఖైదీపై రైలులో కానిస్టేబుల్ అత్యాచారం
- కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్తుండగా ఘటన
- విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరింపు
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
కోర్టు విచారణ అనంతరం గత శనివారం ఆమెను తీసుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరారు. ఈ క్రమంలో ఖైదీపై కన్నేసిన కానిస్టేబుల్ ఆమె బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.